హుద్హుద్ తుఫాన్ వల్ల 400 మత్స్యకారుల బోట్లు మునిగిపోయాయి. దాదాపు నాలుగేళ్లు అవుతున్నా కేవలం 30 బోట్లకు మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగతా వాటికి ఇవ్వలేదని నిలదీస్తే రిజిస్ట్రేషన్లు లేవని సాకులు చెబుతున్నారు. మా నియోజవర్గ ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాం. అయినా పట్టించుకోలేదు. పరిహారం అందితే మళ్లీ కొత్త బోట్లు కొనుగోలు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటాం. అధికారంలోకి వచ్చిన తరువాత మీరే మా సమస్యను పరిష్కంచాలని జగనన్నను కోరా. తప్పక ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
– వాసుపల్లి రాజు, పిషింగ్ హార్బర్, విశాఖ