కేరళ హైకోర్టుకు జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ బదిలీ! 

19 Jan, 2019 09:34 IST|Sakshi

సుప్రీం కోర్టు నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ను కేరళ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని జస్టిస్‌ ఎస్‌వీ భట్‌కు సైతం సుప్రీం కోర్టు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బదిలీకి సంబంధించిన అధికారిక తీర్మానం త్వరలో వెలువడే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ, మరికొందరికి పదోన్నతి కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల నిర్ణయం తీసుకుంది. 
 

మరిన్ని వార్తలు