చంద్రబాబును కలిసిన కిదాంబి శ్రీకాంత్‌

29 Mar, 2018 11:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు సాధించిన శ్రీకాంత్‌ను చంద్రబాబు అభినందించారు.

శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోస్టింగ్‌ ఆర్డర్‌ను సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ గోపిచంద్ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు