ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వెళ్లను..

30 Mar, 2018 16:54 IST|Sakshi

యానాం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తోసిపుచ్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తలు నిరాధారమని ఆమె అన్నారు. ఆమె నిన్న (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్‌ బేడీ స్పష్టం చేశారు. కాగా కిరణ్‌ బేడీ వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్‌ వర్గీయులు ...ఆమె క్లారిటీ ఇవ్వడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

మరిన్ని వార్తలు