శ్రీవారికి నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ

1 Oct, 2013 08:22 IST|Sakshi

తిరుమలలో శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను టీటీడీ నేడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆర్జీత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 12.00 గంటల వరకు సర్వదర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.

 

అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు