'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'

20 Mar, 2014 08:15 IST|Sakshi
'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో ఎద్దేవా చేశారు. అందుకే బాబు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అఖండ విజయం సాధిస్తుందని కొణతాల రామకృష్ణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు