డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులు నమోదు

14 May, 2014 20:28 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా కోర్టులు: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెట్టేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో తొమ్మిది కేసులను నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు.

మేజిస్ట్రేట్ యూసుఫ్ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు