ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

13 Mar, 2016 13:56 IST|Sakshi

వైఎస్సార్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తొండూరు మండలం పేలూరు, తుమ్మలపల్లి గ్రామాల సమీపంలోని పొలాల్లో పురుగుల ముందు సేవించి అపస్మారక స్థితిలో ఉన్న యువతీ, యువకుడ్ని ఆదివారం స్థానికులు గుర్తించి పులివెందుల ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం వారిని కడప జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. తొండూరు మండలం పేలూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పుల్లాయప్ప (25), తుమ్మలపల్లి గ్రామానికి చెందిన లీలావతి (23)గా వారిని గుర్తించారు.

 

>
మరిన్ని వార్తలు