లారీ ఢీకొని వ్యక్తి మృతి

5 Aug, 2015 09:48 IST|Sakshi

వేపాడ(విజయనగరం): లారీ రివర్స్ తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న కార్మికుడిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం గ్రామంలోని క్రషర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన జొన్నపల్లి శ్రీను(35) క్రషర్‌లో కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రాత్రి రివర్స్ తీస్తున్న లారీ ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు