16న వైద్య సేవలు బంద్

9 Nov, 2016 02:26 IST|Sakshi

దేశ వ్యాప్తంగా ఐఎంఏ సత్యాగ్రహం

 విజయవాడ (లబ్బీపేట): నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి గంగాధరరావు చెప్పారు. ఆ రోజు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపేస్తామన్నారు.

గవర్నర్‌పేటలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జి.సమరం, డాక్టర్ అప్పారావు, డాక్టర్ సీఎస్‌ఆర్ ప్రసాదరావు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు