బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా

21 Dec, 2013 09:31 IST|Sakshi
బీస్ సాల్ బాద్..... అన్న గుత్తా

నల్గొండ : 'రాయల్ ఎన్ఫీల్డ్' ను చూడగానే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మనసు లాగేసినట్టుంది. బండి నడిపి తన ముచ్చట తీర్చుకున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల ఈ బైక్ను కొనుగోలు చేశాడు. శుక్రవారం నల్గొండలోని ఎంపీ నివాసానికి కార్యకర్త వెళ్లగా, సుఖేందర్ రెడ్డి బుల్లెట్ను నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్ల తర్వాత ఈ వాహనం నడిపానని చెప్పారు. రాజకీయ నేతల తమ చిన్న చిన్న కోర్కెలను కూడా తీర్చుకునేందుకు చాలా సంవత్సరాలు ఆగాల్సి వస్తుందంటే ఈ ఘటననే  ఓ ఉదాహరణ

మరిన్ని వార్తలు