అశోక్‌బాబుకు ఓయూ పోలీసుల నోటీసు

21 Dec, 2013 17:07 IST|Sakshi
అశోక్‌బాబుకు ఓయూ పోలీసుల నోటీసు

హైదరాబాద్: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసు జారీ చేశారు. ఏపీఎన్జీవో ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయనగా ఇప్పుడు అర్ధాంతరంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చిన అశోక్ బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు అశోక్ బాబుకు నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న అశోక్ బాబు హాజరు కావలంటూ పోలీసులు అదేశించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు