'కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'

10 Aug, 2015 19:58 IST|Sakshi

డక్కిలి: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా డక్కిలి మండలం తీర్థంపాడు, ఆమడూరు గ్రామాల్లో జరిగిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, ఈ ఏడాది అదనంగా మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. ఎఫ్‌ఎస్, తెలుగు గంగ కెనాళ్లను అభివృద్ధి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు