‘రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది’

28 May, 2017 14:29 IST|Sakshi
‘రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది’

విజయవాడ: పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రేదేశ్‌కు రూ. 10,500 కోట్లు ఇచ్చామని అంటున్నారు. మరోవైపు ఇటివల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు మాత్రం రూ. 1.75 లక్షల కోట్లు ఇచ్చారన్నారు. ఈ రెండీట్లో ఏది నిజమో చెప్పాలని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు.ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లుడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.1,16,000 కోట్లు అప్పు చేశారు. అమిత్‌షా ఇచ్చినవి, చంద్రబాబు తెచ్చినవి ఇవన్ని ఎక్కడికి పోయాయో బాబు సమాధానం చెప్పాలి. పాలన పరంగా రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందని ఆయన మండిపడ్డారు.

 

మరిన్ని వార్తలు