25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

4 May, 2016 11:50 IST|Sakshi

పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం బి.కొండెపాడు వద్ద రెవెన్యూ శాఖ అధికారులు 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని బుధవారం ఉదయం పట్టుకున్నారు. విజయవాడ వైపు నుంచి ఓ లారీలో పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్టు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని పోలీసులకు స్వాధీనం చేశారు.

మరిన్ని వార్తలు