ఒంగోలు వన్టౌన్:‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశాడు. ఆయన మాటలు నమ్మి బ్యాంక్లో తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేదు. తర్వాత తీసుకున్న రూ. 60 వేలకు రూ. 1.20 లక్షలు కట్టాల్సి వచ్చింది. రుణమాఫీ కోసం సీఎంను కలసినా న్యాయం జరగలేదు’ అంటూ పొన్నలూరు మండలం కె. అగ్రహారం గ్రామానికి చెందిన ప్రత్తి కేశవస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని సంకల్పయాత్రలో జననేత దృష్టికి తీసుకెళ్లారు.