కాళ్లు చచ్చుబడినా పింఛన్‌ ఇవ్వడం లేదయ్యా..

16 Apr, 2018 07:21 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అయ్యా.. రెండేళ్ల క్రితం నా భర్తకు పక్షవాతం వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నోటి మాట కూడా రావడం లేదు. అయినా ఈ ప్రభుత్వం కరుణించడం లేదు’ అంటూ కొత్తూరు తాడేపల్లికి చెందిన కంపా అయోధ్య భార్య బంగారమ్మ ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే డాక్టర్‌ సర్టిఫికెట్‌ కావాలని చెబుతూ కాలయాపన చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. చెరువుగట్టున ఇళ్లు వేసుకుంటే, అధికారులు తీసేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి దయనీయ పరిస్థితిని చూసి చలించిన వైఎస్‌ జగన్‌ న్యాయం జరిగేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.

>
మరిన్ని వార్తలు