బాబు అదృశ్యమై పది నెలలైనా ఆచూకీ లేదు

3 May, 2018 08:10 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అన్నా... మా బాబు గణేష్‌ తప్పిపోయి సుమారు పది నెలలు అవుతుంది. మానసికలోపంతోపాటు మాటలు కూడా సరిగా రావు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అయితే వెతకండి..కనిపిస్తే అడ్రస్‌ చెప్పండి..అని పోలీసులు చెబుతున్నారు’ అని కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన వి.బ్రహ్మయ్య, కళావతి దంపతులు బుధవారం జననేత జగన్మోహనరెడ్డిని కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు వచ్చి బస్సులు వచ్చి ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేతను కలిశారు. గత ఏడాది జూన్‌లో  కర్నూలులో  గణేష్‌ తప్పిపోయాడని , ఇంత వరకు బిడ్డ కోసం ఎక్కడెక్కడో  వెతికినా  కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పెంటర్‌గా జీవనం సాగించే  తన కుటుంబం బిడ్డలపైఎన్నో ఆశలు పెట్టుకున్నామని జననేతకు వివరించారు.

మరిన్ని వార్తలు