తూర్పుగోదావరి :విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని అనేకసార్లు ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరినా ఖాతరు చేయడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని రావులపాలెం, ఊబలంక విద్యుత్ సబ్స్టేషన్లోని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.