ప్రైవేటు బ్యాంకులో వెయ్యికోట్లు.. టీటీడీపై పిల్‌

22 Apr, 2018 15:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల శ్రీవారి ఆదాయంలోని రూ. వెయ్యి కోట్లను ప్రవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైంది. ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన శ్రీవారి ఆదాయాన్ని ఇలా ప్రవేటు బ్యాంకులో డిపాజిట్‌ చేయడాన్ని తప్పుబడుతూ వెంకన్న భక్తుడు నవీన్‌కుమార్ రెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్, టీటీడీ కార్యనిర్వహణాధికారి, ఇందుసిండ్ బ్యాంకులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

మరిన్ని వార్తలు