పోలీసుల అదుపులో గుర్ల తహశీల్దార్

25 Nov, 2015 13:35 IST|Sakshi
పార్వతీపురం: నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో విజయనగరం జిల్లా గుర్ల తహశీల్దారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం కొమరాడ తహశీల్దార్‌గా ఉమాకాంత్‌పాండే పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంతో కోటిపాం వీఆర్వో శారదకు కూడా సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రస్తుతం గుర్ల మండల తహశీల్దారుగా పనిచేస్తున్న ఉమాకాంత్‌తో పాటు వీఆర్వో శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
 
మరిన్ని వార్తలు