పేకాటస్థావరాలపై పోలీసుల దాడులు

14 Jan, 2014 18:14 IST|Sakshi

హైదరాబాద్: నగర శివారు వనస్థలిపురం బ్రాహ్మణపల్లిలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల నుంచి మూడు కార్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  పోలీసుల అదుపులో ఉప సర్పంచ్ సహా వార్డు మెంబర్ ఉన్నట్టు సమాచారం. సంకాంత్రి సందర్భంగా ఓ వైపు పూజా కార్యక్రమాలతో భక్తులు లీనమై ఉండగా, మరో వైపు జూదాలు, బెట్టింగ్లతో జూదరులు గడుపుతున్నారు.

మరిన్ని వార్తలు