పోస్ట్‌మెట్రిక్‌ హెచ్‌డబ్ల్యూవో సస్పెన్షన్‌

9 Apr, 2018 07:12 IST|Sakshi
విద్యార్థులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో శివశంకర్‌

సీతంపేట : సీతంపేట పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహ సంక్షేమాధికారి కె.రాజారావును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్‌ ఆదివారం సస్పెండ్‌ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పీవో ఆకస్మికంగా ఈ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వసతిగృహ మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించకపోవడం, మౌలికవసతులు కల్పించాలని గతంలో హెచ్చరించినా సరైన మౌలికవసతులు కల్పించకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ఆయన్ని సస్పెండ్‌ చేసినట్టు పీవో తెలిపారు. సరైన పర్యవేక్షణ లేనందుకు ఏటీడబ్ల్యూవో వెంకటరమణకు షోకాజ్‌నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు