సాక్షి, తిరుమల: భారత రాష్ట్రపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామ్నాథ్ కోవింద్ సెప్టెంబరు 1న కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్నట్లు సమాచారం. రాత్రికి ఇక్కడే బస చేసి, 2వ తేదీన వారు శ్రీవారిని దర్శించుకోనున్నారు.
అదేవిధంగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. అధికారిక ఉత్తర్వులు ఇంకా అందలేదని వారు తెలిపారు.