ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న టెంపో

23 May, 2015 18:15 IST|Sakshi

రామకుప్పం : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద రహదారిపై ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న ఐచర్ టెంపో ఢీకొట్టింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన రామకుప్పం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు