హైవేపై దగ్ధమైన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

17 Dec, 2019 08:30 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరి మండలం కొలనుకొండ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే మీద వెళుతున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగాయి. అయితే, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు వెంటనే అప్రమత్తమై దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు దగ్ధమవ్వగా.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
మంటలను అదుపులోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు