శ్రీమఠం వసతిగృహంలో చోరీ

4 Sep, 2015 11:01 IST|Sakshi

కర్నూలు: మంత్రాలయంలోని శ్రీమఠం వసతి గృహంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు..మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య గౌడ్, నర్సింహులు కుటుంబసభ్యులతో కలిసి గురువారం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. దర్శించుకున్న తర్వాత అదే రోజు రాత్రి శ్రీమఠం వసతి గృహంలో కుటుంబసభ్యులతో కలిసి బస చేశారు.

నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని, ఓ సెల్‌ఫోన్‌ను తస్కరించారు. ఉదయాన్నే చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న బాధితులు మంత్రాలయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు