రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ భర్త మృతి

28 Nov, 2015 14:44 IST|Sakshi

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా దొండపల్లి మండలం నిలివాడ గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త బంగారునాయుడు(40) ఈ రోజు బైక్ పై విశాఖపట్నం వెళ్తుండగా.. గ్రామ శివారులోకి చేరకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఔ

 

మరిన్ని వార్తలు