23,24 తేదీల్లో ఢిల్లీలో సచివాలయ ఉద్యోగుల దీక్ష

15 Sep, 2013 15:34 IST|Sakshi

గుంటూరు: సమైక్య రాష్ట్రం కోసం ఈ నెల 23,24 తేదీల్లో  ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపడతామని  సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల  ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ చెప్పారు.  300 మంది సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగం తగ్గిందని చెప్పారు.  విభజన వల్ల దేశం వినాశనం అవుతుందన్న  ఇందిరాగాంధీ మాటను  ఏఐసిసి అధ్యక్షురాలు  సోనియా గాంధీ  పట్టిచ్చుకోవడంలేదన్నారు.

మరిన్ని వార్తలు