ఏపీలో టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్

7 Mar, 2020 12:20 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వం శనివారం కొత్త షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

కొత్త షెడ్యూల్
మార్చి 31-ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1
ఏప్రిల్ 1-ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2
ఏప్రిల్ 3- సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
ఏప్రిల్ 4- ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6-ఇంగ్లీష్‌ పేపర్-2
ఏప్రిల్ 7-మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8-మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9-జనరల్ సైన్స్‌ పేపర్-1
ఏప్రిల్ 11-జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 13-సోషల్ స్టడీస్ పేపర్-1
ఏప్రిల్ 15- సోషల్ స్టడీస్‌ పేపర్-2
ఏప్రిల్ 16- ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్‌ పేపర్-2
ఏప్రిల్ 17-SSC ఒకేషనల్ కోర్స్‌ థియరీ

మరిన్ని వార్తలు