పార్లమెంటులో అల్లూరి విగ్రహం..!

27 Jun, 2019 15:23 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంపై విగ్రహ కమిటీ కూడా ఆమోదం తెలిపినందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు విలేకర్లతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలతో పాటు చత్తీస్‌ గఢ్‌, ఒరిస్సాలోని ఏజెన్సీ ప్రాంతాల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుందని, 73వ స్వాతంత్ర దినోత్సవం కల్లా అల్లూరి విగ్రహ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులై 4న అల్లూరి జయంతి సందర్భంగా ఆరోజు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా మాట్లాడేందుకు జీరో అవర్‌లో స్పీకర్ అనుమతి కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.   
 

మరిన్ని వార్తలు