జేఎఫ్‌సీకి రాష్ట్ర ప్రభుత్వం 118 పేజీల నివేదిక

18 Feb, 2018 01:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ(జేఎఫ్‌సీ)కి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఓ నివేదిక పంపింది. రాష్ట్ర ప్రభుత్వ మెస్సెంజర్‌ ద్వారా పంపిన 118 పేజీల నివేదికలో విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక ప్యాకేజీ హామీ తదితర వివరాలను పేర్కొంది.

కేంద్ర బడ్జెట్‌కి ముందుగా ప్రధానికి అందచేసిన విజ్ఞప్తులను  పొందుపరిచారు.పవన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది శ్రీకాంత్‌కు నివేదిక అందచేశారు.  

మరిన్ని వార్తలు