శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి

22 Mar, 2019 00:50 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణియన్‌ దర్శించుకున్నారు.  న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంతో సత్కరించారు. 

మరిన్ని వార్తలు