టీచర్ దాడితో కుప్పకూలిన విద్యార్థి

22 Aug, 2015 13:52 IST|Sakshi

కృష్ణా: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ఎనిమిదో తరగతి బాలుణ్ని చితకబాదాడు. సుధాకర్ అనే ఉపాధ్యాయుడు హోంవర్క్ చేయలేదని ఆ విద్యార్థిపై ఆగ్రహంతో మెడపై కొట్టాడు. దీంతో ఆ బాలుడి నరాలు దెబ్బతినడంతో కాళ్లు, చేతులు పనిచేయలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు