ఈ నడక.. మర్చిపోలేని జ్ఞాపకం

6 Sep, 2018 07:14 IST|Sakshi
వెంకట వీరయ్య, వనపర్తి, తెలంగాణ

సాక్షి, విశాఖపట్నం : నాది తెలంగాణ రాష్ట్రం వనపర్తి. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. ఓ కాలు సరిగ్గా లేదు. కర్ర సహాయం లేనిదే నడవలేను. నాకు దివగంత ముఖ్య మంత్రి వైఎస్సార్‌ హ యాంలోనే వికలాంగ పింఛన్‌ మంజూరైంది. వైఎస్సార్‌ కుటుంబం అంటే ఎనలేని గౌరవం. ఆ కుటుంబం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏ కార్యక్రమం చేపట్టిన నేను స్వచ్ఛందంగా పాల్గొంటాను. గతంలో వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలసి నడిచాను. ఆయన తనయ షర్మిలమ్మ చేపట్టిన పాదయాత్రలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో పాల్గొన్నాను. ఇప్పుడు జననేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో కూడా నడుస్తున్నాను. పాదయాత్ర ప్రారంభమైనప్పటీ నేను పాల్గొంటున్నాను. ఇచ్ఛాపురంలో పాదయాత్ర పూర్తయ్యేంతవరకు ఆయన వెంటే నడుస్తాను. రాష్ట్ర భవిష్యత్‌ కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. వైఎస్సార్‌ కుటుంబంతో పాదయాత్రలో నేను పాల్గొనడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం.– వెంకట వీరయ్య, వనపర్తి, తెలంగాణ

మరిన్ని వార్తలు