సాక్షి, హైదరాబాద్ : మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చానని ఇందులో భాగంగానే మద్యం నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టు దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ట్విటర్లో పేర్కొన్నారు. ఎర్రమంజిల్ పురాతనమైన భవనం కాదన్న ప్రభుత్వ వాదన సంతృప్తికరంగా లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరణ శుక్రవారం ఇవ్వాలంటూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..