ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు - రాకపోకలు బంద్

10 Nov, 2015 14:33 IST|Sakshi

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సైదాపురం మండల శివారులోని రెండు ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గాల్లో మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు స్తంభించాయి. సైదాపురం-గూడూరు మధ్య ఉన్న కమాన్‌గెనివాగు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సైదాపురం- మార్కాపురం మార్గంలోని మాలేరు వాగు పొంగడంతో ఈ మార్గాంలో కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. సైదాపురంలో సోమవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


 

మరిన్ని వార్తలు