క్వారీ గుంతలో గుర్తుతెలియని మృతదేహం

25 May, 2015 16:51 IST|Sakshi

గుంటూరు (ఎడ్లపాడు) : గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఉన్న కొండ క్వారీ గుంతలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. క్వారీ కూలీలు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసే పనిలో ఉన్నారు.  కాగా గుర్తుతెలియని ఆ యువకుడి వయసు సుమారు 14 ఏళ్లు ఉంటుంది. రెండు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు