విజయవాడ: నగరంలో ఇంద్రకీలాద్రిపై కోలువైన కనకదుర్గమ్మ ఆలయంలో విజయీభవ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 25 వేల మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. 'విజయీభవ' కోసం కనకదుర్గమ్మ అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు.
ఆమ్మవారిని దర్శించుకున్న విద్యార్థులకు ప్రసాదం, పెన్నుతోపాటు పాకెట్ క్యాలెండర్ను ఆలయ అధికారులు విద్యార్థులకు అందజేశారు. మరో 15 వేల మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ ఉన్నతాధికారులు వెల్లడించారు. విద్యార్థుల కోసం కింద నుంచి ఇంద్రకీలాద్రి కొండపైకి అయిదు బస్సులను ఉచితంగా నడుపుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.