శ్రీకాకుళం :ఆమదాలవలస మున్సిపాలిటీకి మూడు కిలోమీటర్లు దూరంలో మా గ్రామం సొట్టవానిపేట ఉంది. మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందిపడుతున్నాం. తాగునీరు లేదు. డ్రైనేజీలు లేవు. రేషన్ కోసం మూడు కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో వందలాది కుటుంబాలు నిత్యం ఇబ్బంది పడుతున్నాయి. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి.– లింగభేరి అరుణ, సొట్టవానిపేట