విశాఖ:నగర, జిల్లా టీడీపీ అధ్యక్షులను ఆదివారం ఎన్నుకోనున్నారు. నగర అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్, హర్ష వర్ధన్ ప్రసాద్ లు పోటీ పడుతుండగా, జిల్లా అధ్యక్ష పదవికి రామానాయుడు, భాస్కర్ రావు, శ్రీనివాస్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఎన్నికకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.