వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Sun, May 17 2015 10:23 AM

Brutal murder in Karimnagar

కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : ఒక వ్యక్తిని కొంతమంది దుండగులు కత్తులతో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కొండాపూర్ గ్రామానికి చెందిన మలయాల రాములు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రాములు ఆదివారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్తుండగా దారికాసిన దుండగులు కత్తులతో అతని గొంతు కోసి హత్య చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతుడు గతంలో గ్రామంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో పాతకక్ష్యల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement