భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య

24 May, 2015 09:32 IST|Sakshi

ప్రొద్దుటూరు: భర్త వేధింపులు భరించలేక ఓ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లెలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చౌడమ్మ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం దొరసానిపల్లెకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే, భర్త తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో చౌడమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు