కాలువలో మహిళ మృతదేహం

27 Nov, 2015 15:12 IST|Sakshi

దుర్గి (గుంటూరు) : నాగార్జున సాగర్ కుడి కాలువలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎన్‌ఎస్‌పీ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా.. లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు