211వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

11 Jul, 2018 21:51 IST|Sakshi

సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 211వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజక వర్గంలో వియవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.

గురువారం ఉదయం నైట్‌క్యాంప్‌ శివారు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఉలపల్లి వరకు పాదయాత్ర  కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజు ముగిసింది. బుధవారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి జననేత 210వ రోజు పాదయాత్రను ప్రారంభించారు.  అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్‌ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. నేడు జననేత 6.3కిలో మీటర్లు నడిచారు. ఇప్పటివరకూ వైఎస్‌ జగన్‌ 2,522.7 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
 

>
మరిన్ని వార్తలు