271వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

26 Sep, 2018 07:53 IST|Sakshi

సాక్షి, ఎస్‌.కోట(విజయనగరం): రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరంలో అనంతవాహినిలా సాగిపోతోంది. బుధవారం ఉదయం జననేత 271వ రోజు పాదయాత్రను లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సంతపేట, లక్కవరపు కోట, ఖాశాపేట, కుర్మవరం క్రాస్‌, తలరి మీదుగా కొట్యడ వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. 

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.

చదవండి: 

నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే

చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.

మరిన్ని వార్తలు