మంత్రి నారాయణకు వైఎస్‌ జగన్‌ ఫోన్‌కాల్‌

11 May, 2017 12:26 IST|Sakshi
నారాయణను ఫోన్‌ లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.  వైఎస్‌ జగన్‌ గురువారం మంత్రి నారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిషిత్‌ మృతిపట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు అతని అంత్యక్రియలు నెల్లూరులో నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు