జగన్ ఎప్పుడూ కోహినూర్ వజ్రమే: ప్రసన్న కుమార్

23 Sep, 2013 20:44 IST|Sakshi

నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  ఎప్పుడూ కోహినూర్ వజ్రమేననే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్కు బెయిల్ మంజూరు కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన కుట్రలు బహిర్గతమయ్యాయన్నారు.

 వైఎస్ జగన్‌కు బెయిల్ రావడంతో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌, వేదాయపాలెం సెంటర్‌లలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, కావలి, కోవూరులలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల సంబరాలు జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు