విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన

20 Oct, 2014 12:18 IST|Sakshi

విజయనగరం : హదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం భోగాపురం మండలం ఏ రావివలస నుంచి తన పర్యటనను ప్రారంభించారు.

 

తుఫాను బాధితులు, రైతులను పరామర్శించిన ఆయన అనంతరం  దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ పూసపాటిరేగ మండలంలోని కోనాడ, తిప్పలవలసలో పర్యటించి మత్స్యకారులు, రూతులను ఓదార్చి వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు.

మరిన్ని వార్తలు