శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

21 May, 2014 11:29 IST|Sakshi
శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో బుధవారం  జరుగుతున్న ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. వైఎస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో  వైఎస్ జగన్ భేటీ కానున్నారు.

 

మరిన్ని వార్తలు